Sunday, April 28, 2024
- Advertisement -

అన్న‌య్య బార్‌లో త‌మ్ముడి సంద‌డి

- Advertisement -
  • బీ డ‌బ్స్‌లో సంద‌ర్శించిన అల్లు శిరీశ్‌

అల్లు శిరీశ్ త‌న అన్న‌య్య ప్రారంభించిన ఓ స్పోర్ట్స్ బార్‌లో సంద‌డి చేశాడు. నేరుగా కిచెన్‌లోకి వెళ్లి అంద‌రితో స‌ర‌దాగా మాట్లాడాడు. త‌నకు తోచిన వంట‌ను చేశాడు. ఇటీవ‌ల వ్యాపారంలోకి దిగిన అల్లు అర్జున్ ఓ అంత‌ర్జాతీయ స్పోర్ట్స్ బార్‌ను హైద‌రాబాద్‌లో ప్రారంభించాడు. దీనికి విశేష స్పంద‌న వ‌స్తోంది. ఈ బార్‌ను త‌న త‌మ్ముడు అల్లు శిరీష్ సంద‌ర్శించాడు. సంద‌ర్శించి తెగ సంద‌డి చేశాడు. ఈ విశేషాల‌ను తెలుపుతూ శిరీశ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశాడు. త‌ను వంట చేస్తున్న ఫొటోను పంచుకున్నాడు.

ఈ వంట ఎక్కడో కాదు తన అన్న అల్లు అర్జున్ తాజాగా హైదరాబాద్‌లో ఓపెన్ చేసిన పోష్ బార్‌లో తీసుకున్నాడు. ఇటీవల ఈ పోష్ బార్‌ను బి-డబ్స్ అనే పేరిట ప్రారంభించారు. అయితే ఈ బార్‌కు అల్లు శిరీష్ వచ్చాడు. డైరెక్ట్‌గా కిచెన్ రూంలోకి వెళ్లి వంటలు చేశాడు. తనకున్న ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. చికెన్ వింగ్స్ తయారు చేసి ఇదిగో ఇలా సిద్ధమైందంటూ ఆహార ప్రియుల నోరూరేలా ఓ ఫొటో తీశాడు. ఆ వెంట‌నే ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం అల్లు శిరీష్ ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేం డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఒక్క క్షణం సినిమా చేస్తున్నాడు. థ్రిల్లర్ జోనర్ సినిమా అయిన ఈ సినిమా డిసెంబర్‌లో క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -