Saturday, May 18, 2024
- Advertisement -

ఈ రాష్ట్రానికి 90 వేల కోట్లు ఇచ్చాం – అమిత్ షా

- Advertisement -

తెలంగాణ అన్ని రంగాల్లోనూ అభివ్రద్ధి సాధించాలంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివ్రద్ధి కోసం 90 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని ఆయన చెప్పారు.

నల్గండ జిల్లా సూర్యాపేటలో జరిగిన బహిరంగ సభలో అమితాషా మాట్లాడారు. కేంద్రం ఇక్కడి అభివ్రద్ధి కోసం వేలాది కోట్ల రూపాయలు ఇస్తున్నా అది ప్రజలకు చేరడం లేదని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లో ఒవైసీ కుటుంబానికి సమాధానం చెప్పగలిగే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమేనని  అమిత్ షా అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో అవినీతి రహిత పాలన అందించామని, ఏ అంశంలోనైనా ప్రజలతో నేరుగా మాట్లాడే ప్రభుత్వం తమదేనని అన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. గత ప్రభుత్వమైన యుపిఎ పాలనలో దేశంలో 12 లక్షల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాలు జరిగాయని ఆయన అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తన కళ్లకు ఇటాలియన్ అద్దాలు పెట్టుకున్నారని, అవి తీసి చూస్తే తప్ప ఇక్కడేం జరుగుతోందో ఆయనకు తెలియదని అమిత్ షా అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -