Saturday, May 4, 2024
- Advertisement -

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన టీడీపీ ఎంపీ అవంతిశ్రీనివాస్‌..

- Advertisement -

అన‌కాప‌ల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ వైఎస్ జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. లోటస్‌పాండ్‌లోని వైఎస్‌ జగన్‌ నివాసంలో వీరి భేటీ జరిగింది. భేటీ అనంత‌రం జ‌గ‌న్ అవంతికి పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్మానించారు.అవంతి తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపినట్టు సమాచారం. వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నించింది. రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్న అవంతి శ్రీనివాస్… భీమిలీ లేదా విశాఖ నార్త్ టికెట్ తనకు కేటాయించాలని టీడీపీ అధిష్టానాన్ని కోరినట్టు సమాచారం. మ‌రో వైపు త‌న ఎంపీ ప‌ద‌వికి స్పీక‌ర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన‌ట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -