కొత్త సంవత్సర వేడుకల్లో ఎంజాయ్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో పోలీసులకు బుల్లితెర యాంకర్ మాచిరాజు ప్రదీప్ పట్టుబడ్డారు. పట్టుబడిన వారం రోజుల తర్వాత పోలీసుల ముందుకు ప్రదీప్ రానున్నారట. బేగంపేట ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో సోమవారం కౌన్సెలింగ్కు హాజరుకానున్నారని సమాచారం. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ చౌహాన్కు ప్రదీప్ సమాచారం అందించారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి మద్యం సేవించి కారు నడుపుతూ ప్రదీప్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు.
కౌన్సెలింగ్కు హాజరుకాకపోవడంతో పోలీసులు కేపీహెచ్బీలోని ప్రదీప్ కార్యాలయంతోపాటు మణికొండలోని నివాసంలో నోటీసులు అందించేందుకు యత్నించి అందుబాటులో లేకపోవడంతో వెనక్కి వచ్చారు. దీంతో ప్రదీప్ పరారీలో ఉన్నట్లు ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. అజ్ఞాతంలో ఉన్నాడని పుకార్లు రావడంతో ప్రదీప్ స్పందించారు. శుక్రవారం ఓ వీడియో ద్వారా తాను కౌన్సెలింగ్కు హాజరుకాబోతున్నట్లు తెలిపారు.
అయితే తల్లి లేదా భార్యతో కలిసి కౌన్సెలింగ్కు హాజరు కావాలి. ప్రదీప్ ఇంకా వివాహం కాలేదు కావున తల్లిని తీసుకొని వచ్చే అవకాశం ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం ఏర్పాటు చేసుకున్నఘటనలోనూ ప్రదీప్పై పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. కౌన్సిలింగ్ అనంతరం విచారణ చేపట్టి ఏ శిక్ష విధిస్తారో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ వ్యవహారం ప్రదీప్ కెరియర్కు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. గతంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రదీప్ పట్టుబడ్డాడు. ఇప్పుడు రెండోసారి కూడా పట్టుబడడంతో శిక్ష విధించే అవకాశం ఉంది.