Sunday, April 28, 2024
- Advertisement -

ఏపీలో ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు విడుద‌ల‌…

- Advertisement -

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ సాయంత్రం విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల్లో 53,025 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల్లో 66,114 మంది ఉత్తీర్ణులయ్యారు. 22 రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలకు అధికారులు బాగా పనిచేశారని అన్నారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ అప్లై చేసుకునే వారు ఆన్ లైన్ లో ఫీజు చెల్లించాలి. దీని గడువు తేది జూన్ 22.

ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్షకు 4,76,710 మంది హాజరు కాగా.. మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల్లో 2,86,932 మంది విద్యార్థులు, సప్లిమెంటరీ పరీక్షల్లో 53,025 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో ఈ ఏడాది ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో మొత్తంగా 3,39,957 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ ఇంటర్‌ పరీక్షలకు 4,31,739 మంది విద్యార్థులు హాజరుకాగా.. మార్చిలో జరిగిన పరీక్షల్లో 3,09,721 మంది, సప్లిమెంటరీలో 66,114 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో ద్వితీయ ఇంటర్‌లో మొత్తంగా 3,75,835 మంది ఉత్తీర్ణులయ్యారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -