పదిహేను రోజులు పూర్తి కాకుండానే జగన్ మళ్ళీ ఢిల్లీ కి పయనమవుతుండడం ఇప్పుడు అంతటా ఆసక్తి ని రేకెత్తిస్తుంది.. సోమవారం జగన్ ఢిల్లీ కి బయలుదేరుతుండగా మంగళవారం మోడీ తో భేటీ ఉంది.. అయితే మునుపటిసారి పోయినప్పుడే జగన్ మోడీ తో భేటీ కావాల్సి ఉంది.. కానీ అమిత్ షా, జలవనరుల మంత్రి గజేంద్ర షెకావత్ లతో భేటీ అయ్యి సరిపెట్టుకున్నారు.. కానీ ఇప్పుడు ఆ భేటీ జరిగి పదిహేను రోజులు కాకముందే ఇప్పుడు మళ్ళీ పిలుపు రావడం అందరిలో ఆసక్తి పెంచుతుంది.
ఏపీలో రాజకీయాలు కీలక మార్పులకు పీఎంతో సీఎం భేటీ దోహదపడే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఏపీ లో గతంలో ఎన్నడూ లేని ఆసక్తికర రాజకీయాలు జరుగుతున్నాయి.. అవినీతి పై విచారణ గతంలో ఎన్నడూ రీతిగా జరుగుతుంది.. దీని లో భాగమైన ఎవరిని జగన్ వదిలిపెట్టట్లేదు.. అమరావతి స్కామ్, ఫైబర్ గ్రిడ్ పేరుతో సాగించిన అక్రమాలపై దర్యాప్తు కోసం జగన్ పట్టుదలతో ఉన్నారు.. అయితే టీడీపీ కోర్టు ద్వారా ఈ విచారణలపై స్టే తెచ్చుకున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఈ విషయాన్నీ మోడీ దృష్టికి జగన్ తీసుకెళతారని భావిస్తున్నారు..
ఇంకా రాష్ట్ర బీజేపీ నేతలతో ఉన్న విభేదాల గురించి కూడా జగన్ చర్చించనున్నారని తెలుస్తుంది. కేంద్రంలో బీజేపీ నేతలు మాత్రం జగన్ కి అన్ని విధాలా చేదోడుగా ఉంటున్నారు. ప్రధానమైన అంశాల్లో సహాయం అందిస్తున్నారు. అదే రీతిలో జగన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్ధతుగా నిలుస్తున్నారు. కానీ రాష్ట్ర బీజేపీ మాత్రం జగన్ ను విమర్శిస్తూ వార్తల్లో నిలుస్తుంది. అన్నింటికీ మించి రాజకీయంగా జగన్, మోడీ సమావేశంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగా టీడీపీ భవితవ్యం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.బీజేపీతో జతగట్టాలని చంద్రబాబు తహతహలాడుతున్నారు. కానీ పరిస్థితి అనుకూలించడం లేదు. ఈ తరుణంలో మోడీ , జగన్ ఓ నిర్ణయానికి వస్తే టీడీపీకి పూర్తిగా తలుపులు మూసివేయడమే కాకుండా, చంద్రబాబుకి చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.
వైసీపీలోకి గంటా.. వెంటనే ట్విస్ట్ ఇచ్చిన సీఎం జగన్..!
సీఎం జగన్ ప్లాన్ కి విలవిలలాడుతున్న చంద్రబాబు..!