Saturday, April 27, 2024
- Advertisement -

సీఎం జగన్ ప్లాన్ కి విలవిలలాడుతున్న చంద్రబాబు..!

- Advertisement -

సీఎం జగన్ మైండ్ గేమ్ కి చంద్రబాబు విలవిలలాడిపోతున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు బాబు పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. నేరుగా వైసీపీ కండువా కప్పుకో లేదు కానీ తమకు సంబంధించిన వారిని జగన్ పార్టీలో చేర్పించి జగన్ కి జై కొట్టి వచ్చేస్తున్నారు. అంటే దాదాపుగా ఈ నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరినట్లే. అయితే గత ఎన్నికల ముందు జగన్ ఓ మాట చెప్పారు.

తాను పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించను అని ఒకవేళ ఎవరైనా అలా రావాలనుకుంటే ఆయా పార్టీలకు పదవులకు రాజీనామా చేసిన తర్వాతే తమ పార్టీలో చేర్చుకుంటామని అన్నారు. ఆ మాట ప్రకారం ఈ ఇప్పటి వరకు వచ్చిన వారంతా పదవులకు రాజీనామా చేసి వచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం అక్కడ రాజీనామా చేయకుండా ఇక్కడ పార్టీ కండువా కప్పుకోకుండా భలే మైండ్ గేమ్ ఆడారు. ఇదంతా జగన్ యొక్క వ్యూహాత్మక ఎత్తుగడ అని తేలుతోంది. ఇక ఇప్పుడు ఎంపీలను టార్గెట్ చేసింది వైసీపీ సర్కార్.

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబంతో జరిగిన మంతనాల వల్లే జయదేవ్ తల్లి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి టీడీపీని విడినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి తాజాగా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆమె రాజీనామా చేశారని చెబుతున్న పార్టీ విధానాలు నచ్చకే బయటకు వెళ్లి పోతున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు నియామకాల్లో తమ వర్గానికి చెందిన వారికి పదవులు ఇవ్వకపోవడంతో ఆమె నోచ్చుకున్నారట. దానికి తోడు వైసీపీ నుంచి వచ్చిన ఆఫర్ కూడా వారికి నచ్చిందని.. అందుకే వెంటనే టీడీపీకి రాజీనామా చేశారని అంటున్నారు.

బాబుకు పెద్ద షాక్.. వైసీపీలోకి మరో టీడీపీ ఎమ్మెల్యే..!

టీడీపీ కి చెక్ పెట్టేవిధంగా బీజేపీ సరికొత్త ప్లాన్స్..!!

దుబ్బాక లో దుమ్ము రేపడానికి అన్ని పార్టీ లు సిద్ధం..

బీజేపీ లో ఈ ఇద్దరు నిజంగానే అధికారంలోకి తెచ్చేలా ఉన్నారే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -