- Advertisement -
సీఎం జగన్ గవర్నర్ నరశింహన్తో విజయవాడలో భేటీ అయ్యారు. ఈనెల 11 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్ననేపథ్యంలో వీరి భేటీ జరిగింది. 12 అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మహాత్మాగాంధీ రోడ్డులోని గేట్వే హోటల్ కి ఉదయమే గవర్నర్ నరసింహన్ చేరుకున్నారు.
ఈసందర్భంగా ఇద్దరు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో చర్చించనున్నట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం ఈనెల 12వ తేదీన రాష్ట్రబడ్జెట్ను ప్రవేశ పెట్టనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.