- Advertisement -
అధికారంలో ఉన్నాం కదా ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తె మమ్మల్ను ఎవరు ఏంచేయలేరులే అని అనుకున్న టీడీపీనేతలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. గతంలోఐపీఎస్ అధికారి, రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం, బెదిరింపు కేసులో టీడీపీ ఎంపీ నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్యే బోండా ఉమ, పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ నాగుల్ మీరాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
అసలు విషయానికి వస్తె…2017లో రవాణా శాఖ కమిషనర్ గా ఉన్న బాలసుబ్రహ్మణ్యంపై దూషిస్తూ, బెదిరింపులకు దిగిన వ్యవహారాన్ని హైకోర్టు సుమోటాగా స్వీకిరించివిచారణ చేసింది. విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారా వీరికి నోటీసులు అందచేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్కి వాయిదా వేసింది.