- Advertisement -
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్, తెలుగుదేశం నాయకురాలు నన్నపనేని రాజకుమారి అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.
నన్నపనేని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చికిత్స పొందుతున్న నన్నపనేని రాజకుమారిని పరామర్శించారు. నన్నపనేని ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని మంత్రి చినరాజప్ప ఆకాంక్షించారు.