Friday, May 17, 2024
- Advertisement -

అశోక్‌గ‌జ‌ప‌తికి షాకిచ్చిన విమాన సిబ్బంది

- Advertisement -
ఒక‌ప్పుడు విమానాల‌కు అధిప‌తి.. తాను చెప్పిందే వేదం.. అలాంటిది ప‌ద‌వి పోయాక సామాన్యుడ‌య్యాడు. ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో పౌర విమాన‌యాన శాఖ మంత్రిగా ఉన్న అశోక్ గ‌జ‌ప‌తి రాజు ప‌ద‌వి పోయాక సాధార‌ణ ఎంపీ అయ్యాడు. ఇప్పుడు ఆయ‌న ప‌ట్ల విమాన సిబ్బంది పొర‌పాటు చేసింది.
సామాన్యుల సంగతిని వదిలేస్తే.. ప్రముఖుల విషయంలోనూ కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అనుసరిస్తున్న వైనం షాకింగ్‌కు గురి చేస్తోంది. పౌర విమానయాన శాఖకు మంత్రిగా వ్యవహరించిన అశోక్ గజపతి రాజు విషయంలో ఎయిరిండియా త‌ప్పుగా వ్య‌వ‌హ‌రించింది.
మంగళవారం మధ్యాహ్నం భార్య, కూతురు, సోదరితో క‌లిసి అశోక్ గజపతిరాజు ఎయిరిండియా 451 విమానంలో ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి బయలుదేరారు. తన ప్రయాణంలో భాగంగా 9 బ్యాగుల్ని లగేజీలో బుక్ చేశారు.
ఇందులో ఒక బ్యాగ్ కనిపించలేదు. ఈ విషయాన్ని ఎయిరిండియా సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జరిగిన తప్పును గుర్తించిన ఎయిరిండియా సిబ్బంది అశోక్ గజపతికి క్షమాపణలు చెప్పి.. బుధవారం పంపుతామని హామీ ఇచ్చారు.
పౌర విమానయాన శాఖకు మంత్రిగా వ్యవహరించిన వ్య‌క్తి లగేజీ విషయంలో అంత నిర్లక్ష్యం ఉంటే ఇక సామాన్యుల ప‌రిస్థితి ఏంటి? అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -