- Advertisement -
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీ విమానాశ్రయంలోని న్యూఢిల్లీ-శాన్ఫ్రాన్సిస్కో బోయింగ్ 777 విమానంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఏసీ యూనిట్ కు మరమ్మతులు చేస్తుండగా ఈప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు ఎవరూ లేరని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.