Monday, May 13, 2024
- Advertisement -

టీవీ చానళ్లను అక్కడికి తరలించమంటున్న బాబు!

- Advertisement -

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఉన్న మీడియా పిచ్చి గురించి వేరే చెప్పనక్కర్లేదు. జనాల్లో ఇమేజ్ పెరగాలంటే మీడియా మ్యానేజ్ మెంటే ముఖ్యమని ఆయన భావిస్తారు. అందుకు తగ్గట్టుగా బాబు కు మీడియా మ్యానేజ్ మెంట్ లో పండితుడిగా పేరుంది. ఇలాంటి నేపథ్యంలో బాబు మీడియా పిచ్చికి సంబంధించి ఇది మరో ఉదంతం.

ఓటుకు నోటు వ్యవహారంలో ఇప్పటికే తెలుగుదేశం అధినేత పరువు పోయింది.  ఎదురుదాడి అయితే చేయవచ్చు కానీ.. ఈవ్యవహారంలో బాబు ఇరుక్కొన్నారు.

ఇలాంటి నేపథ్యంలో బాబుకు ఒక్కసారిగా హైదరాబాద్ అంటే విసుగువచ్చింది. ఇక్కడ అధికారం కేసీఆర్ చేతిలో ఉంది కాబట్టి.. ఇక్కడ నుంచి వెళ్లిపోవడమే మేలన్నట్టుగా బాబు భావిస్తున్నాడు. మరి ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటే తమకంటూ ఒక రాజధాని ఉండాలి. అక్కడ అన్నిహంగులూ ఉండాలి. ఏమున్నా ఏమిలేకపోయినా.. ప్రత్యేకంగా మీడియా కవరేజీ అయితే ఉండాలనేది బాబు కోరిక. అందుకే ఇప్పుడు బాబుగారు మీడియాధినేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

అతిత్వరలో బాబు టీవీ చానళ్ల అధిపతులతో సమావేశం కావాలని అనుకొంటున్నారట. ఆ సమావేశానికి అన్ని చానళ్ల అధిపతులనూ పిలిపించుకొని.. ఆయా చానళ్ల కేంద్ర కార్యాలయాలను ఏపీకి తరలించే ఏర్పాట్ల గురించి బాబు అడిగి తెలుసుకొంటారని సమాచారం. అందరూ ఏపీకి తరలిరావాలని.. ఇక్కడ కేసీఆర్ మీడియాను సరిగా చూసుకోవడం లేదు.. తను మాత్రం బాగా చూసుకొంటాను అంటూ బాబు వారికి హామీ ఇవ్వనున్నారని మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంలో మీడియాధినేతలు బాబు మాటను ఫాలో కావడం సంగతి ఏమో కానీ.. బాబుగారి మీడియా పిచ్చిమాత్రం తేటతెల్లం అవుతోందిప్పుడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -