బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో తేజస్విని తాజాగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.వాంగ్మూలంలో కీలక నిజాలు వెలుగు చూశాయి.శిరీష చావు తనకు బాధ కలిగించిందని ఇంత చిన్న విషయానికి ఆత్మమత్య చేసుకుంటాదని అనుకోలేదని తెలిపింది.
రాజీవ్ విషయంలో తను శిరీషతో గొడవ పడ్డామని, ఒక రోజు ఇద్దరమూ తన్నుకుంటుంటే, విడదీయలేక రాజీవ్ స్వయంగా ‘100’ కాల్ చేసి పోలీసులను పిలిపించాడని, అప్పుడే కేసును పరిష్కరించి ఉంటే ఇప్పుడు ఇంతజరిగేదికాదని వాంగ్మూలంలో వెల్లడించినట్లు సమాచారం. రాజీవ్ లేని సమయంలో తాను స్టూడియోకు వెళ్లి, అతన్ని వదిలివేయాలని వాగ్వాదానికి దిగానని తేజశ్వని చెప్పారు. అప్పట్లో పోలీసులు వచ్చారే తప్ప, ఎటువంటి చర్యలూ తీసుకోలేదని పేర్కొంది. వారిని రాజీవే పంపించి వేశాడని తెలిపింది.
{loadmodule mod_custom,GA1}
ఫేస్ బుక్ లో శిరీష ఫోటోలను రాజీవ్ ట్యాగ్ చేసినప్పుడు తనకు తొలిసారిగా అనుమానం వచ్చిందని, అప్పట్లో బెంగళూరులో ఉన్న తాను, ఈ విషయమై రాజీవ్ కు ఫోన్ చేసి నిలదీశానని చెప్పింది. ఆమె బిజినెస్ పార్టనర్ అని రాజీవ్ చెబితే, తొలుత నమ్మానని, ఆపై వారిద్దరి మధ్యా ఉన్న అసలైన సంబంధం గురించి తెలుసుకుని, శిరీషను వదిలివేయాలని రాజీవ్ ను హెచ్చరించినట్టు చెప్పుకొచ్చింది.
తమ మధ్య ఉన్నది అనుమానపు మాటల యుద్ధమేనని, దాని కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని తాను భావించడం లేదని, ఆమె మృతి వెనుక మరో బలమైన కారణం ఉండే ఉంటుందని తేజస్విని చెప్పినట్టు సమాచారం.ఈ కేసులో శిరీష-తేజస్విని మధ్య జరిగిన వాగ్మూలం కేసుకు కీలకంగా మారనుంది.
{loadmodule mod_custom,GA2}
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}hSINxEWUo2c{/youtube}