Friday, April 19, 2024
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు

- Advertisement -

రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆశాకిరణం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని తెలుగు రాష్ట్రాలు ఘనంగా నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గార్డెన్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు శంకుస్థాపన చేయనున్నారు.

అనంతరం అక్కడే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దళితులకు ముఖ్యమంత్రి వరాలు ఇవ్వనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. 

మరోవైపు తెలుగుదేశం పార్టీ తెలంగాణ సిఎంను దళిత వ్యతిరేకి అంటూ విమర్శిస్తోంది. ఆయన క్యాబినెట్ లో అంటరానితనం చూపుతూ అంబేద్కర్ కు విగ్రహాలు ఏర్పాటు చేస్తారా అని టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నరిసింహులు మండిపడుతున్నారు. ఇక బిజెపి అయితే అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ది చేసే కార్యక్రమం చేపట్టింది. ఎన్నికల్లో అంబేద్కర్ ఓడించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దళితుల ఓట్ల కోసం నాటకాలు ఆడుతోందంటూ బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -