- Advertisement -
నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీకి భంగపాటు జరిగింది. 18 స్థానాలకు గాను బీజేపీ 7 మాత్రమే గెలుచుకుంది. బీహార్ లో 10 స్థానాలకు ఎన్నికలు జరగగా, లాలు – నితీష్ కూటమి 6 స్థానాల్లో విజయం సాధించింది.
బీజేపీ నాలుగు స్థానాలు దక్కించుకుంది. పంజాబ్ లో రెండు స్థానాలకు గాను కాంగ్రెస్, శిరోమణి అకాలిదల్ చెరో స్థానాలు కైవసం చేసకున్నాయి. కర్ణాటకలో మూడు స్థానాలకు గాను కాంగ్రెస్ రెండు, బీజేపీ ఒక స్థానంలో గెలుపొందాయి. మధ్య ప్రదేశ్ లో 3 స్థానాలకు బీజేపీ రెండు, కాంగ్రెస్ ఒకటి గెలుచుకున్నాయి.