- Advertisement -
పారిస్ లో నిన్న జరిగిన బాంబ్ దాడుల వలన ఎంతో మంది ప్రాణాలు విడిచారు.పారిస్ లో ఉన్న విదేశీయులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.అయితే ఇదే దాడుల్లో ఇంకొందరికి గాయాలయ్యాయి.
ఆద్యా న్యూస్ కు అందిన ఎక్స్ క్లూజివ్ న్యూస్ ప్రకారం.. ఈ దాడుల నుంచి ప్రముఖ తెలుగు నటుడు నందు తప్పించున్నారు .ఇంకో గంటలో తాను గమ్యానికి చేరుకుంటాననే లోపలే అతను బాంబ్ దాడుల సమాచారాన్ని అందుకున్నాడట. ఒక రకంగా చెప్పాలంటే ఇంకో గంట ఆలస్యంగా బాంబ్ లు పేలితే…నటుడు నందు బాంబ్ దాడుల ప్రాంతంలోనే చిక్కుకునే వారు..ఈ విషయం తెలిసిన వెంటనే నందు తల్లి తండ్రులు అతనికి ఫోన్ చేసి యోగ క్షేమాలు తెలుసుకున్నారట.