Wednesday, May 15, 2024
- Advertisement -

శ్రీధామ్​ ఎక్స్​ప్రెస్​ లో బాంబు కలకలం..!

- Advertisement -

శ్రీధామ్​ ఎక్స్​ప్రెస్​లో ఓ తెల్ల బ్యాగ్​లో బాంబు ఉందని రైల్వే పోలీసులకు వచ్చిన ఓ ఫోన్​కాల్​ కలకలం రేపింది. ఢిల్లీలోని హజ్రత్​ నిజాముద్దిన్​ రైల్వే స్టేషన్​ నుంచి మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్ వెళ్తున్న ఎక్స్​ప్రెస్​ రైలును హరియాణాలోని ఓల్డ్ ఫరీదాబాద్​లో మధ్యాహ్నం అత్యవసరంగా ఆపారు అధికారులు.

బాంబు స్క్వాడ్​ బృందాలతో రైలులో తనిఖీలు నిర్వహించారు. కిందకు దిగిన ప్రయాణికుల లగేజ్​ బ్యాగులలో కూడా సోదాలు చేశారు. దాదాపు మూడున్నర గంటల పాటు శ్రమించి రెైలులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధరించారు. దీంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఫోన్​కాల్ కారణంగా రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

నిజాముద్దిన్ రైల్వే స్టెషన్​లో ఇద్దరు వ్యక్తులు.. రైలులో బాంబు పెట్టిన విషయంపై మాట్లాడుకుంటుండగా మూడో వ్యక్తి విని.. రైల్వే పోలీస్​ హెల్ప్​ లైన్​కు ఫోన్​ చేసి సమచారమిచ్చాడని అధికారిక వర్గాలు తెలిపాయి. వెంటనే రైలుని ఫరీదాబాద్​లో ఆపినట్లు పేర్కొన్నాయి. చివరకు అది నిజం కాదని తేలింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -