Thursday, May 16, 2024
- Advertisement -

ప్రియురాలిని చంపి స‌మాధిపై మొక్క నాటిన ప్రియుడు…

- Advertisement -

ప్రేమించాన‌న్నాడు…. పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చాడు. కొన్నేళ్లుగా ఆమెతో స‌హ‌జీవ‌నం చేసి మోజు తీరాకా పో అన్నాడు. ప్రియురాలు పెళ్లి చేసుకోమ్మ‌ని ఒత్తిడి చేయ‌డంతో మ‌రొక‌రితో క‌ల‌సి అత్య చేసి స‌మాధిపై మొక్క నాటాడో మావ‌న మృగం. ఈ సంఘ‌ట‌న కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. పోలీసుల విచార‌ణ‌లో ఈ వ్య‌వ‌హారం మొత్తం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

వివ‌రాల్లోకి వెల్తే…కేరళలోని తిరువనంతపురంలో అఖిలేష్‌ నాయర్ అనే ఆర్మీ అధికారి ఉంటున్నాడు. అతను రేఖ‌మాల్ అనే ఆమెతో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఇటీవ‌లె అఖిల్‌కు పెళ్లి కుద‌ర‌డంతో త‌న‌కు దూరంగా వెళ్లిపోవాల‌ని ప్ర‌తిపాద‌న చేశారు. కాని రేఖ ఒప్పుకోక పోవ‌డంతో పెళ్లి చేసుకోవాల‌ని ఒత్తిడి చేయ‌డంతో అత‌నిలోని మాన‌వ మృగం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

స‌హ‌నం కోల్పోయిన అఖిల్ ఆమెకు మాయ‌మాట‌లు చెప్పి కారులో ఎక్కించుకొని కొంత దూరం వెల్లిన త‌ర్వాత ఆమెను గొతు నులుమి దారుణంగా చంపాడు. తన ఇంటి దగ్గరే గొయ్యి తవ్వి శవాన్ని పాతిపెట్టాడు. వాసన రాకుండా మృతదేహంపై ఉప్పు చల్లాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఓ మొక్కను కూడా నాటాడు. అయితే తమ కుమార్తె కనిపించడం లేదని రేఖ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు రేఖను అఖిల్ చంపినట్లు నిర్ధారించారు. అఖిల్‌తోపాటు హ‌త్య‌కు స‌హ‌క‌రించిన మ‌రో వ్య‌క్తి పారారీలో ఉన్నారు.నిందితుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -