- Advertisement -
రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ ఔటర్ రింగ్రోడ్డుపై ఘో ర కారు ప్రమాదం చోటు చేసుకుంది. ఔటర్పై వెళ్తున్న కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడటంతో కారులో చిక్కుకున్న ఓకరు సజీవ దహనమయ్యారు. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. మేడ్చల్ నుంచి పఠాన్చెరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.