- Advertisement -
కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని మోసం కేసులో ప్రశ్నించే నిమిత్తం సుజనాను సీబీఐ పిలిచినట్టు తెలుస్తోంది. 2017లో ఆంధ్రా బ్యాంకును రూ.71 కోట్ల మేర మోసం చేసిన కేసు నిమిత్తం సీబీఐ బెంగళూరు బ్రాంచ్ ఆయనకు సమన్లు జారీ చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సుజనా చౌదరికి చెందిన రూ. రూ.315 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.