- Advertisement -
బాబ్రీ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని బుధవారం విచారించనుంది అలహాబాద్ హైకోర్టు. అయోధ్య వాసులు హాజీ మహ్మూద్ అహ్మద్, సయ్యద్ అఖ్లాఖ్ అహ్మద్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆల్ ఇండియా ముస్లి పర్సనల్ లా బోర్డు సభ్యుడు జఫార్యద్ జిలానీ పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించనున్నారు.
వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రం తీసుకువచ్చిన మూడు చట్టాలపై రైతుల్లో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో ఉభయులతో సంప్రదింపులు జరిపేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నియమించిన నలుగురు సభ్యుల కమిటీపై రైతు సంఘాలు, విపక్షాలు పెదవి విరిచాయి. సభ్యులంతా గతంలో ఈ చట్టాలకు అనుకూలంగా మాట్లాడినవారేనని పేర్కొంటున్నాయి.