- Advertisement -
ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం ఇచ్చే విందుకు తెలుగు రాష్ట్రాల సిఎంలు హాజరు కానున్నారు.
దీనికి వేదికగా రాజ్భవన్ కానుంది. ఈ విందుకు రావాల్సిందిగా ఇద్దరు సిఎంలను గవర్నర్ నరసింహన్ ఆహ్వానించిన నేపథ్యంలో వాళ్ళిద్దరు ఎదురుపడితే ఏం మాట్లాడుకుంటారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. నోటుకు ఓటు వ్యవహారం జరిగిన తర్వాత ఒకరికి ఒకరు తారసపడుతున్న సందర్భంలో, లోపల ఇద్దరిలో అగ్ని జ్వాలలు రగులుతున్నా పైకి నిండు చంద్రుడిలా నవ్వుతూ హాయ్ కేసిఆర్, హలో చంద్రబాబు అని పలకరించుకుంటారో చూద్దాం. లేక రాష్ట్రపతి ఏమైనా జోక్యం చేసుకుని ఇద్దరిని కలిపే ప్రయత్నం చేస్తారేమో చూద్దాం.
సెక్షన్8 అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి ఏం జరుగనుందో రేపటి వరకు వేచి చూడాలి.