పవన్, ప్రధాని మోదీ, జగన్పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. కేంద్రంపై సొంతంగా అవిశ్వాసతీర్మానం పెట్టిన బాబు ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, జనసేన పార్టీ స్థాపించిన పవన్ కల్యాణ్ లతో కలసి మోదీ డ్రామాలు ఆడుతున్నారని బాబు ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని..అది వైకాపా, జనసే ఒత్తిడి కారనంగా వచ్చిందని చూపాలనే మోదీ నాటకాలాడుతున్నారు.
హోదా కోసం ఆమరణ దీక్షకు దిగుతానని పవన్ వెల్లడించడాన్ని గుర్తు చేసిన ఆయన, పవన్ దీక్ష తరువాత విధిలేని పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తున్నామని, ప్రజా సెంటిమెంట్ ను గౌరవిస్తున్నామని ప్రధాని నుంచి ప్రకటన వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. మేరకు ఇప్పటికే పవన్ కల్యాణ్ కు కేంద్రంలోని పెద్దల నుంచి సూచనలు అందాయని చంద్రబాబు ఆరోపించారు. కేంద్రం కుట్రలు, ఆడుతున్న డ్రామాలపై ప్రజల్లోకి వెళతామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు వ్యతిరేకంగా మహాకుట్ర జరుగుతోందని, దీన్ని ఎదుర్కొంటామని ఆయన అన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని చెప్పడానికి ఇంతకన్నా రుజువులు ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. దోషులందరినీ ప్రజా కోర్టులో నిలుపుతామని ఆయన హెచ్చరించారు.