Thursday, May 16, 2024
- Advertisement -

బాబు అనుయాయులే ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడా?

- Advertisement -

ఏపీకి కొత్త బీజేపీ అధ్యక్షుడు రాబోతున్నాడట.. ఈ ప్రచారం చేస్తున్నది ఎవరో బీజేపీ వాల్లు అయితే ఫరవాలేదు.. స్వయంగా ఏపీ టీడీపీ నేతలేనట.. అవును ఇప్పుడు కన్నా తమకు కొరుకుపడని నేత కావడంతో ఆయన ప్లేసులో తమ పార్టీ నుంచి వెళ్లి బీజేపీలో చేరిన అనుయాయులు సీఎం రమేష్, సుజనాచౌదరిలలో ఎవరో ఒకరిని బీజేపీ అధ్యక్షుడిని చేయాలని చంద్రబాబు తలపోస్తున్నారట.. ఈ మేరకు ఢిల్లీలో వీరిద్దరితో చర్చలు కూడా జరుపుతున్నట్టు వినికిడి.

తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇదేకామెంట్ చేశారు. బీజేపీ ఏపీ విభాగం అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను మార్చడానికి చంద్రబాబు ప్రయత్నిస్తూ ఉన్నారని విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. కన్నా స్థానంలో సీఎం రమేష్, సుజనాల్లో ఒకరిని కూర్చుండబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

2014లో బీజేపీ-టీడీపీ దోస్తీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు నాటి బీజేపీ నేత సోము వీర్రాజు చంద్రబాబును ఏకిపారేసేవారు. ఈయన నిర్నయాలపై విరుచుకుపడేవారు. అందుకే సోము వీర్రాజును చంద్రబాబే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కాకుండా అడ్డుకున్నాడన్న చర్చ సాగింది. ఇప్పుడు కూడా తనకు ఏకు మేకులా మారిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాను తప్పించి తన అనుయాయులను చేర్పించేలా లాబీయింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. అందుకే వ్యూహాత్మకంగా టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరినా పెద్దగా స్పందించకుండా ఉన్నారు. ఇప్పుడు బీజేపీని కూడా ప్రభావితం చేసేలా కనిపిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -