Saturday, April 20, 2024
- Advertisement -

యువకులపై.. చంద్రన్న కన్నీటి ధారా వాహిని..!

- Advertisement -

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు టిడిపి అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వివేకానంద కలలుగన్న సమాజం ఆవిష్కరణే లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. వివేకానందుడు చూపిన బాటలో యువతరం నడవాలని సూచించారు. 19 నెలలుగా రాష్ట్ర భవిష్యత్తు అంధకారమైందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని ముంచారని ఆరోపించారు. యువజన సంక్షేమ పథకాలను రద్దు చేశారనీ.. యువత స్వయం ఉపాధి అవకాశాలకు గండి కొట్టారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

వేలమంది యువతీయువకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యతను యువతరమే తీసుకోవాలని.. పాలకుల దుశ్చర్యలపై అన్ని వర్గాల ప్రజలను చైతన్యపరచాలని సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -