Wednesday, May 15, 2024
- Advertisement -

ముక్త స‌రిగా స‌మాధానాలిస్తున్న ఛార్మీ

- Advertisement -

డ్రగ్స్ కేసులో నోటీసులందుకున్న సినీ నటి చార్మి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. బౌన్సర్ల భద్రత మధ్య ఆమె సిట్ కార్యాలయానికి వచ్చారు. బుధవారం ఉదయం 10గంటల నుంచి చార్మిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. త‌ను ఇస్టంలేకుండా శాంపిల్స్‌నుతీసుకోవ‌ద్ద‌న్న చార్మీ వాద‌న‌ను కోర్టుఆమోదించింది.
చార్మీని తొలి రెండు గంటల సమయంలో ఆమెను కాల్విన్ తో సంబంధాలపైనే ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత నేతత్వంలోని సీఐలు జయలక్ష్మి, రేణుక, శ్రీలతలు చార్మిని విచారిస్తుండగా, ఆమె ముక్తసరిగా చెబుతున్న సమాధానాలను బయటి నుంచి సిట్ ఉన్నతాధికారులు పరిశీలిస్తూ, అనుబంధ ప్రశ్నలను మహిళా అధికారులకు పంపుతున్నారు.
కాల్విన్ మీకు ఎలా పరిచయమని అడుగగా, ఈవెంట్ మేనేజర్ గా మాత్రమే తెలుసునని చార్మీ చెప్పినట్టు సమాచారం. జ్యోతిలక్ష్మి సినిమా ప్రమోషన్ లో భాగంగా అతను తెలుసునని, ఆపై ఇంకెప్పుడూ కలవలేదని చార్మీ వెల్లడించగా, ఆ తరువాత కూడా మాట్లాడినట్టు, చాటింగ్ చేసినట్టు తమ వద్ద సాక్ష్యాలున్నాయని విచారణ అధికారులు చెప్పినట్టు సిట్ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం వాటినే సాక్ష్యాలుగా చార్మి ముందు పెడుతూ, ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్‌తో చార్మి 1000కిపై సంభాషణలు జరిపినట్లు తెలిసింది. అంతేగాక, కెల్విన్ ఫోన్ డేటాలో చార్మిని చార్మి దాదాగా ఫీడ్ చేసుకున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -