జాలి పడాలో సానుభూతి చూపించాలో తెలియదు కానీ తెలుగు ప్రజలందరికీ దశాబ్ధాలుగా నీతులు చెప్తున్న రామోజీరావు కుటుంబం పెద్ద కోడలిపై 420 కేసు బుక్ చేయమని నాంపల్లి కోర్ట్ ఆదేశించింది. ఇప్పుడు ఈ వార్త సంచలనాలు రేపుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సిఎంగా ఉన్నప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్స్ ఛీటింగ్ వ్యవహారాలపై ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్ట్కు వెళ్ళిన విషయం తెలిసిందే. కోర్ట్లో రామోజీరావుకు చుక్కెదురైంది. ఆ వెంటనే ఇష్యూ మొత్తాన్ని డైవర్ట్ చేసి పడేశారు. రామోజీరావు మార్గదర్శిపై కోర్ట్లో వ్యవహారం నడుస్తుంటే వైఎస్ రాజశేఖరరెడ్డి ఈనాడు మీడియాపై దాడి చేస్తున్నాడని చెప్పి…….మీడియాపై దాడి అంటూ రంకెలేశారు. చంద్రబాబుతో సహా పచ్చ బ్యాచ్ అందరూ కూడా రెచ్చిపోయారు. ఇక మేధావిలా కనిపిస్తూ అవరసమైనప్పుడు పచ్చ బ్యాచ్కి ఉపయోగపడుతూ ఉండే లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ కూడా రంగంలోకి దిగాడు. ఈనాడుపై వైఎస్ రాజశేఖరరెడ్డి కక్ష్య సాధిస్తున్నాడని అడ్డంగా వాదించేశాడు. మార్గదర్శి అక్రమాల గురించి మాట్లాడితే ఈనాడు మీడియాపై దాడి ఎలా అవుతుందంటే మాత్రం సమాధానం ఉండదు. వాళ్ళు చెప్పినట్టే అది ఈనాడుపై దాడి అయితే మరి సాక్షిపై డైరెక్ట్గానే దాడులు జరిగినప్పుడు ఇవే గొంతులు ఎందుకు మూగబోతాయో తెలియదు. అదేంటంటే సాక్షి అక్రమం అంటారు. మరి మార్గదర్శిలో కూడా అక్రమాలు జరిగాయనే కదా కోర్ట్ కేసులు స్వీకరించింది.
ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి లేడు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రామోజీరావుకు సాగిలపడిపోయి ఉన్నారు. ఆ నేపథ్యంలో పోలీసులకు రామోజీరావు కోడలిపై కేసులు నమోదు చేసే ధైర్యం ఎక్కడుంటుంది? అందుకే బాధితురాలు నాంపల్లి కోర్టులో కేసు వేసింది. నాంపల్లి కోర్ట్ రామోజీరావు కోడలిపై 420 కేసు నమోదు చేయమని చెప్పింది. రాజగురువుగా పాలకులు ఫీలవుతున్న రామోజీరావు ఇంటి కోడలిపై కేసు నిలబడే అవకాశం ఉంటుందా? చంద్రబాబు, కెసీఆర్లు మాట్లాడరు. పవన్ కళ్యాణుడు రామోజీరావును అవకాశం వచ్చినప్పుడుల్లా ఆకాశానికెత్తుతూ భజన చేస్తున్న నాయకుడే. ఈ నాయకుల విషయం ఇలా ఉంటే……కనీసం మార్గదర్శిపై అక్రమంగా ఫలాన నాయకుడు కేసులు పెట్టించాడు అంటూ ఆర్తనాదాలు చేయడానికి, ఈనాడుపై దాడిగా ఈ కేసును ట్విస్ట్ చేస్తూ సానుభూతి తెచ్చుకోవడానికి, నిందలు వేయడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకుడు లేకపోవడం మాత్రం ఈ స్థితిలో పచ్చ బ్యాచ్ బాగా లోటుగా ఫీలయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఈ 420 కేసు విషయం మాత్రం ఇంకోలా ట్విస్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. అన్నట్టు రీసెంట్గానే రామోజీరావు కోడలు ది గ్రేటెస్ట్ బిజినెస్ ఉమెన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుగారు రామోజీ కోడలు శైలజాకిరణ్కి గొప్ప సర్టిఫికెట్ ఇచ్చాడు. ఇంతలోనే ఈ 420 కేసు వ్యవహారం వచ్చి పడింది. ఏమిటో……..?