బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వివాదంలో చిక్కుకున్నాడు. తనను సల్మాన్ ఖాన్.. ఆయన కంపెనీ ప్రతినిధులు మోసం చేశారంటూ చండీగఢ్ కు చెందిన అరుణ్ గుప్తా అనే వ్యాపారి ఫిర్యాదు చేశాడు. సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రితో పాటు మరో ఏడుగురిపై సదరు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సల్మాన్ ఖాన్ ఆయన సోదరి మరికొందరు కలిసి హ్యూమన్ ఫౌండేషన్ అనే ఓ సంస్థను నెలకొల్పారు. అయితే వీరు చండీగఢ్ చెందిన వ్యాపారి అరుణ్ గుప్తాతో ఓ ఒప్పందం చేసుకున్నారు.
హ్యూమన్ ఫౌండేషన్ ప్రాంచైజీ కింద చండీగఢ్లో ఓ నగల దుకాణం పెట్టేందుకు సదరు వ్యాపారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ దుకాణాన్ని సల్మాన్ ఖాన్ ప్రారంభిస్తారని కూడా చెప్పారు. దీంతో అరుణ్ గుప్త దాదాపు రూ. 3 కోట్లు ఖర్చుచేసి దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. అయితే అరుణ్ గుప్తకు హ్యూమన్ ఫౌండేషన్ నుంచి రావాల్సిన సరకు రాలేదు. అంతేకాక దుకాణం ఓపెన్ చేసేందుకు సల్మాన్ ఖాన్ కూడా అంగీకరించలేదు. ఆయనకు పలు మార్లు ఉత్తరాలు రాశాడు. అంతేకాక కలుసుకోవాలని ప్రయత్నించిప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదు.
’నేను సల్మాన్ ఖాన్ కంపెనీ ప్రతినిధులు మాటలు విని ఎంతో ఖర్చుచేసి దుకాణం ఏర్పాటు చేశాను. ఈ షాప్ను ప్రారంభించేందుకు సల్మాన్ ఖాన్ ఒప్పుకున్నాడు. నన్ను బిగ్బాస్ హౌస్కు కూడా తీసుకెళ్లారు. కానీ ప్రస్తుతం దుకాణం ఓపెనింగ్కు రావడం లేదు. కనీసం స్పందించడం లేదు’ అని ఆయన పేర్కొన్నారు. అరుణ్ గుప్తా స్టేట్మెంట్ పరిశీలించిన ఎస్పీ కేతన్ బన్సాల్.. సల్మాన్ అండ్ టీమ్పై కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. 13వ తేదీలోపు ఈ కేసుపై వివరణ ఇవ్వాలని సల్మాన్ను ఆదేశించినట్లుగా ఎస్పీ పేర్కొన్నారు.
Also Read
మా ఎన్నికలు: ప్రకాష్ రాజ్ కు గట్టిగా బదులిచ్చిన నరేశ్..!