Saturday, April 27, 2024
- Advertisement -

చైనా సైనికుడు భారత భూభాగంలోకి ఎంట్రీ.. పట్టుకున్న బలగాలు..!

- Advertisement -

తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు వద్ద భారత సైన్యం అదుపులోకి తీసుకున్న తమ సైనికుడిని అప్పగించాలని చైనా కోరింది. చీకటి, కష్టమైన దారి వల్ల తమ సైనికుడు దారి తప్పి భారత భూభాగంలోకి అడుగుపెట్టారని తెలిపింది. సంబంధిత ఒప్పందాలను పాటిస్తూ తమ సైనికుడిని తిరిగి అప్పగించాలని చైనా స్పష్టం చేసింది.

తూర్పు లద్దాఖ్ లో భారత్-చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా జవాన్ భారత భూభాగంలోకి రావడం కలకలం సృష్టిస్తోంది. తెల్లవారుజామున పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సైనికుడిని గుర్తించిన భద్రతాదళాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. సైనిక నిబంధనల మేరకు చైనా సైనికుడిని విచారణ చేస్తున్నామన్న అధికారులు సరిహద్దు దాటి రావాల్సిన పరిస్థితులపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.

ఈ విషయాన్ని చైనా సైన్యానికి కూడా సమాచారం ఇచ్చినట్లు అధికారులు చెప్పారు. డ్రాగన్ జవాన్ భారత భూభాగంలోకి రావడం గత నాలుగునెలల్లో ఇది రెండోసారి. గతేడాది అక్టోబరులో తూర్పు లద్దాఖ్ లోని డెమ్ చోక్ సెక్టార్ లో చైనా సైనికుడిని భారత బలగాలు అదుపులోకి తీసుకొని మూడు రోజుల దర్యాప్తు తర్వాత వదిలేశాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -