- Advertisement -
ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యులు కుటుంబ సభ్యులతో కలిసి సినిమాకు వెళ్లే పరిస్థితి నేడు లేదని తెలంగాణ సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ధియోటర్స్లలో టికెట్లును అధిక ధరకు విక్రయించడంతోపాటు, స్నాక్స్ కూడా స్నాక్స్ ను కూడా అధిక ధరకు అమ్ముతున్నారని మంత్రి మండిపడ్డారు.
హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంలో ఉన్నతాధికారులతో తన ఛాంబర్లో మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఆన్లైన్ సినిమా టికెటింగ్ విధానం అమలు అంశంపై పలు సూచనలు చేశారు. న్ని ప్రైవేటు వెబ్సైట్లు ఒక్కో టిక్కెట్ ధరపై రూ.20 నుంచి రూ.40 సేవారుసుం వసూలు చేస్తున్నాయని చెప్పారు. అలాగే, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే థియేటర్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.