- Advertisement -
రేపు మంత్రి వర్గ ప్రమాణస్వీకారం ఉండటంతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరశింహన్ విజయవాడ చేరకున్నారు. ఈసందర్భంగా సీఎం వైఎస్ జగన్ గవర్న్తో భేటీ అయ్యారు. శనివారం ఉదయం 11.49 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఒకేసారి 25 మంది మంత్రులుతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విజయవాడకు చేరుకున్న గవర్నర్తో జగన్ సమావేశమయ్యారు. 25 మంది మంత్రుజాబితాను గవర్నర్కు జగన్ అందజేశారు. కేబినెట్లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉంటారని జగన్ స్పష్టం చేశారు. అలాగే ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు కూడా ఇవ్వాలని జగన్ నిర్ణయించిన విషయం తెలిసిందే.