- Advertisement -
శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితులకోసం సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుుకున్నారు. కిడ్నీ బాధితులకు రూ.10.000 ఫెన్సన్ ను ఇస్తున్న ప్రభుత్వం వారికోసం కీలక నిర్ణయం తీసుకుంది.
ఉద్ధానం కిడ్నీ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు వీలుగా పలాసలో పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే పలాసలో 200 పడకల సామర్థ్యం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించింది. ఈ ఆసుపత్రికి అనుబంధంగా రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్లు పనిచేయనున్నాయి. ఇందుకోసం రూ.50 కోట్లు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.రెగ్యులర్ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్ట్ పద్ధతిలో 98 ఉద్యోగాలు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 60 ఖాళీలను ఈ సందర్భంగా భర్తీ చేయనున్నారు