- Advertisement -
నూతన సంవత్సరంలో భారత్ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్ఠ మరింత ఇనుమడిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభ పరిస్థితులు మనకు కొత్త పాఠాలు నేర్పించాయని పేర్కొన్నారు.
ఆకాశవాణి ద్వారా మన్కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా గొలుసు సరఫరా వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. ఆర్థికవేత్తలు కూడా అంచనా వేయలేని పరిస్థితులు వచ్చాయన్నారు. ఈ కాలంలో భారత్ మరిన్ని సామర్థ్యాలు పెంపొందించుకుందని తెలిపారు. దేశ ప్రజల ఆలోచనల్లోనూ ఈ ఏడాది భారీ మార్పులు వచ్చాయని చెప్పారు