సమయం, సందర్భంలేకుండా కండోమ్ యాడ్స్ టీవీల్లో దర్శనమిస్తుంటాయి. అయితే ఈ యాడ్స్పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చిన్నపిల్లలను ఈ ప్రభావం నుంచి రక్షించేలా సోమవారం కొన్ని ఆంక్షలు విధించింది. కొన్ని వయస్సుల వారికే పరిమితమైన కండోమ్ ప్రకటనలను ఉదయం 6 గం.ల నుంచి రాత్రి 10 గం.ల మధ్య ప్రసారం చేయొద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
పిల్లలపై దుష్ప్రభావం చూపిస్తున్న కారణంగా వీటిని రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల మధ్య మాత్రమే ప్రసారం చేయాలని సమాచార ప్రసారాల శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ నిబంధనలు, 1994కి సవరణలు చేస్తూ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అభ్యర్థన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
కొన్ని వయస్సుల వారికే పరిమితమైన కండోమ్ ప్రకటనలను ఉదయం 6 గం.ల నుంచి రాత్రి 10 గం.ల మధ్య ప్రసారం చేయొద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సమాచార ప్రసారాల శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పిల్లలపై దుష్ప్రభావం చూపిస్తున్న కారణంగా వీటిని రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల మధ్య మాత్రమే ప్రసారం చేయాలని పేర్కొంది.