- Advertisement -
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను ఢిల్లీలోని శ్రీ గంగారాం అస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సోనియా గాంధీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, చికిత్స వివరాలను తెలియజేస్తామని గంగారాం ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు.
మాచల్ ప్రదేశ్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో ప్రచారం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సిమ్లాలోనే ఉన్న సోనియా గాంధీ ఈ రోజు సాయంత్రం అస్వస్థతకు గురి కావడంతో ఆమెను వెంటనే ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. 71 ఏళ్ల సోనియా ఇదివరకు పలు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే.