Saturday, May 4, 2024
- Advertisement -

జ‌గ‌న్ సొంత జిల్లాలో నాటు బాంబుల క‌ల‌క‌లం….

- Advertisement -

క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగులో నాటు బాంబులు క‌ల‌క‌లం రేపాయి. ముద్దనూరు రోడ్డులో ఓ ఖాళీ స్థలంలో 54 బాంబులు బయటపడ్డాయి. మంగళవారం రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం ఖాళీ స్థలాన్ని జేసీబీ, ట్రాక్టర్ల సాయంతో చదును చేస్తున్నారు. ఓచోట బకెట్ ట్రాక్టర్ డ్రైవర్‌ కంటపడ‌టంతో… అనుమానంతో బయటకు తీసి చూస్తే.. నాటు బాంబులు కనిపించాయి. దీంతో షాక్ తిన్న డ్రైవ‌ర్ పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

అనుమానంతో బకెట్ బయటపడిన చుట్టు పక్కల ప్రాంతాల్లో జేసీబీ సాయంతో వెతికి చూడగా.. మరికొన్ని బాంబులు బయటపడ్డాయి. మొత్తం 54 బాంబులు బయటపడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ బాంబులు ఆ స్థలంలోకి ఎలా వచ్చాయో ఆరా తీస్తున్నారు. ఈ నాటుబాంబులు ఎందుకు తెచ్చి ఉంటారా అన్న దానిపై పోలీసులు ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు.

వరుసగా నాటు బాంబులు బయటపడుతున్న నేపథ్యంలో స్థానికంగా ఉంటున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మైలవరం మండలం రామచంద్రయ్య పల్లెల్లో ఇలాగే గుర్తుతెలియని వ్యక్తులు ఓ పొలంలో బాంబులు నిల్వ చేశారు. ఆ బాంబులు పేలి పొలం పనులు చేస్తున్న సోమశేఖర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -