Friday, March 29, 2024
- Advertisement -

కొవిషీల్డ్‌ కి నేపాల్ అనుమతి.. కానీ ఆ ఒక్కటి..!

- Advertisement -

భారత్‌లో తయారవుతోన్న కొవిషీల్డ్‌ టీకాకు పొరుగు దేశం నేపాల్‌ కూడా అనుమతి ఇచ్చింది. ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకాను నేపాల్‌లో అత్యవసర వినియోగం కింద అమనుతి ఇస్తున్నట్లు అక్కడి డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. దీంతో మరికొన్ని రోజుల్లోనే కొవిషీల్డ్‌ టీకాలను భారత్‌ నుంచి సేకరించే అవకాశం ఉంది.

భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారుచేస్తోన్న కొవిషీల్డ్‌ టీకాను ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు భారత్‌ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 2కోట్ల డోసులను పొరుగు దేశాలకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, భారత్‌లో వ్యాక్సిన్‌ తయారీ సంస్థలైన సీరం ఇన్‌స్టిట్యూట్‌తో పాటు భారత్‌ బయోటెక్‌ సంస్థల నుంచి వ్యాక్సిన్‌ను తీసుకొని నేపాల్, బంగ్లాదేశ్‌, శ్రీలంక, అఫ్గానిస్థాన్‌, మారిషస్‌ వంటి ప్రాంతాలకు సరఫరా చేసే అవకాశాలున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. పొరుగుదేశాలకు సరఫరా చేసిన అనంతరం, లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, యూరప్‌ దేశాలకు కూడా వ్యాక్సిన్‌ సరఫరా చేస్తుందని నివేదికల సారాంశం. ఇప్పటికే చైనా వ్యాక్సిన్‌ ప్రయోగాలను చేపడుతోన్న బ్రెజిల్‌ కూడా కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -