Thursday, April 25, 2024
- Advertisement -

శౌచాలయంలో లక్షల నగదు.. అసలు ఏమైంది అంటే..!

- Advertisement -

బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని శౌచాలయంలో లక్షల రూపాయల నగదును కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో సోదాలు జరుగుతున్నాయి అని తెలిసిన ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి, అతని భార్య శౌచాలయంలో రూ.10 లక్షల నగదు వదిలి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.

చెన్నైకి చెందిన కస్టమ్స్​ అధికారి అహ్మద్ మొహమ్మద్, అతని సతీమణి లఖ్​నవూకు బయలుదేరారు. బెంగళూరు విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు అని తెలుసుకున్నారు. ఈ క్రమంలో అతని భార్య సూట్ కేసుతో శౌచాలయంకు వెళ్లారు. అక్కడే తన వద్దన ఉన్న 10 లక్షల నగదును విసిరేశారు.

ఎయిర్​పోర్టులో విధులు నిర్వహించే సీఐఎస్​ఏపీ అధికారులకు అనుమానం వచ్చి.. దంపతుల వద్ద ఉన్న సూట్ కేసు తనిఖీ చేయగా అందులో రూ. 74,81,500 ఉన్నట్లు గుర్తించారు. అంతేగాక అందులో 200 గ్రాముల బంగారం, ఖరీదైన ఫోన్లు, ఆపిల్​ వాచ్​లు, నెక్లెస్​, అయిదు బంగారు ఉంగరాలు ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము పట్టుబడడం చూసిన అధికారులు ఒక్క క్షణం కంగుతిన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -