- Advertisement -
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం విషమించింది. కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. కొద్ది సేపటిక్రితం హెల్త్ బులెటిన్ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది కావేరి ఆసుపత్రి యాజమాన్యం.
వయసు సమస్యల దృష్ట్యా కరుణానిధి శరీరంలోని కీలక అవయవాలను సాధారణ స్థితికి తీసుకురావడం ఇబ్బందిగా మారుతోందని డాక్టర్లు వెల్లడగించారు. రానున్న 24 గంటల్లో చికిత్సకు స్పందించిన తీరును బట్టి తదుపరి చికిత్స అందించనున్నట్లు తెలిపారు.