Wednesday, April 24, 2024
- Advertisement -

రేవ్ పార్టీల‌ల్లో ట్యాబ్లెట్ల రూపంలో డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా..

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో డ్ర‌గ్స్ క‌ల్చ‌ర‌ల్ పెరిగిపోతోంది. ప్ర‌ధానంగా హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ మాఫియా చెల‌రేగిపోతోంది.ఎక్కువ‌గా నైజీరియ‌న్లు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాలో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తున్నారు. త‌ప్పుడుప‌త్రాలు, వీసీకాలం ముగిసినా ఇక్క‌డే ఉండి అసాంఘిక కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్నారు. రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో నైజీరియన్‌ నేరగాళ్ల దగ్గర దొరికిన డైరీలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.
డ్రగ్స్ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ఈ కేసులో రోజురోజుకి వెల్లడవుతున్న విషయాలు చూసి విస్తుబోతున్నారు. రిసార్ట్స్ లో రేవ్ పార్టీలు నిర్వహిస్తూ డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నట్లు కూడా అధికారులు గుర్తించారు.రేవ్ పార్టీల కోసం ముంబై, గోవా, ఢిల్లీ, నైజీరియా వంటి ఆఫ్రికా దేశాల యువతులను మాఫియా గ్యాంగ్ లు రప్పిస్తూ వ్యభిచారాన్ని కూడా నిర్వహిస్తున్నారనే సమాచారం కూడా అందింది
ముఖ్యంగా డ్ర‌గ్స్ కావాలంటె వారి కోడ్ భాష‌లో చెప్పాలి. కొకైన్‌ కావాలంటే ‘కో’ అని.. అమ్మాయి కావాలంటే ‘బ్లాక్‌బెర్రీ(బీబీ)’గా సంకేత నామాలు వాడినట్లు గుర్తించారు పోలీసులు.డ్ర‌గ్స్‌ను ట్యాబ్లెట్ల‌రూపంలో వినియేగ దారుల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్నారు.విదేశీ యువతులతో ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనేందుకు ఈ ట్యాబ్ లెట్స్ ను వినియోగిస్తున్నట్లు విచారణాధికారులు గుర్తించారు. ఈ డ్రగ్స్ కు ప్రత్యేకమైన కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది.
ఈ డ్రగ్స్ లైంగిక వాంఛ పెంచుతాయని చెబుతూ వినియోగదారులకు అమ్మినట్లు నిందితులు వెల్లడించారు. గులాబీ రంగు మాత్రల్ని అమ్మాయిలకు, నీలం రంగు మాత్రల్ని అబ్బాయిల కోసం ప్రత్యేకంగా తయారు చేశారంటూ అంటగట్టేవారని దర్యాప్తులో తేలింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -