తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో తీవ్ర విషాదం చోటచేసుకుంది. అర్థక ఇబ్బందుల కారణంగానె ఓ వైద్యుడి కుటుంబం బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెల్తే….ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ పెనుమత్స రామ కృష్ణంరాజు అలియాస్ కృష్ణంరాజుకు మంచి పేరుంది.డాక్టర్ కృష్ణంరాజు(55), ఆయన భార్య లక్ష్మీదేవి (45), పెద్ద కుమారుడు కృష్ణసందీప్ (25) బలవన్మరణానికి పాల్పడ్డారు.కృష్ణసందీప్ ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసినట్టు సమాచారం. ఇక రెండో కొడుకు రాజానగరంలోని జీఎస్ఎల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు.
రియలెస్టేట్ వ్యాపారంలో ఆయన పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే, వ్యాపారంలో నష్టాలు రావడంతో భార్య, కుమారుడితో కలసి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. సెలైన్ ద్వారా విషం ఎక్కించుకుని వీరు బలమన్మరణానికి పాల్పడ్డారు. అమలాపురంలోని సొంతింటిలో కృష్ణంరాజు కుటుంబం విగతజీవులుగా పడిఉండటాన్ని గమనించిన వారి ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.