ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుని ఒంటిచేత్తో క్వాలిఫయర్-2కి చేర్చిన రిషబ్ పంత్పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. విశాఖల సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో పంత్ మెరుపు ఇన్నీంగ్స్ ఆడిన రిషబ్ పంత్ (49: 21 బంతుల్లో 2×4, 5×6).. ఢిల్లీ జట్టుని విజయతీరాలకి చేర్చాడు.ఆఖరి బంతికి గెలిచిన ఢిల్లీ జట్టు శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్తో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనుంది.
ఇదలా ఉంటె ఇటీవలె ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో రిషబ్కు చోటివ్వకపోవడంతో బీసీసీఐపై అభిమానులు విమర్శలు గుప్పించారు. హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ను ఎత్తి చూపిస్తూ బీసీసీఐకి సామాజిక మాధ్యమాల్లో చురకలు వేస్తున్నారు. ఢిల్లీ విజయానికి చివరి 18 బంతుల్లో 34 పరుగులు అవసరమగా.. బసిల్ థంపీ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ భారీ షాట్లు ఆడిన పంత్ వరుసగా 4, 6, 4, 6 బాదేసి ఆ ఓవర్లో మొత్తం 22 పరుగులు రాబట్టాడు.