Sunday, May 5, 2024
- Advertisement -

ధోనిపై మరో సారి నోరు పారేసుకున్న భాజాపా ఎంపీ గంభీర్….

- Advertisement -

సోషల్ మీడియాలో ఎంత చుకుగాఉంటారో అంతే రీతిలో విమర్శలు చేయడం మాజీ క్రికెటర్, భాజాపా ఎంపీ గంభీర్ కు అలవాటు. సందర్భం దొరికినప్పుడల్లా క్రికెటర్ల పై విమర్శలు సంధించే గంభీర్ మరో సారి తన నోటికి పని చెప్పారు. ధోని రిటైర్మెంట్ పై తన దైన శైలిలో విమర్శనాస్ట్రాలు సంధించారు.

అసలు జట్టుకు ధోని ఎందుకు దూరంగా ఉంటున్నాడో చెప్పాలన్న గంభీర్‌.. తనకు నచ్చిన సిరీస్‌ల్లో ఆడతానంటే కుదురనేది విషయం తెలుసుకోవాలన్నాడు. ‘ రిటైర్మెంట్‌ అనేది వారి వ్యక్తిగత నిర్ణయమన్నారు.ధోనితో సెలక్టర్లు మాట్లాడి అతని ప్రణాళిక ఏమిటో తెలుసుకోవాలి. అసలు భారత్‌కు మళ్లీ ఆడతాడా.. లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకోండంటూ సూచన చేశారు. టీమిండియాకు ఆడాలనుకుంటే నీకు నచ్చిన సిరీస్‌లను ఎంపిక చేసుకుంటానంటే కుదరదు’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.

వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ను తొలగించాలంటూ ఇటీవల టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సూచించిన గంభీర్‌.. అతనికి మరిన్ని అవకాశాలు ఇస్తేనే సబబుగా ఉంటుందని మాట మార్చాడు. ‘ రిషభ్‌ పంత్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్‌ అండగా నిలబడాలి అంటూ మద్దతు పలికారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -