Wednesday, May 15, 2024
- Advertisement -

దారుణం : రోడ్డు పక్కన గుడిసెలో బతుకుతున్న ఎమ్మెల్యే

- Advertisement -

రాజకీయాలని మించిన బిజినెస్ ఈ రోజుల్లో ఏదైనా ఉందా ? అంటే లేదనే చెప్పాలి. ప్రజలకి సేవ సంగతి పట్టించుకోరు గానీ స్వయంగా ఎదగడం కోసం కోటాను కోట్లు డబ్బు తినడం ఎమ్మల్యే లకి చాలా సాధారణ విషయం. తరతరాలకి సరిపడా సంపాదించుకోవడం మాత్రమే తమ లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చే వారు ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అంటే ఎవరూ నమ్మరేమో.

తన కోసం ఒక్క రూపాయి కూడా సంపాదించుకోకుండా  అంతా ప్రజలకి ఊడ్చి పెట్టేసి పసి పిల్లలతో, భార్య తో రోడ్డు మీద పడ్డాడు ఈయన. పంజాబ్ రాష్ట్ర లో జరిగింది ఈ సంఘటన. బహుజన్ సమాజ్ పార్టీ న్నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నిక అయిన సింగారారం తన కుటుంబం తో కలిసి రోడ్డు పక్కన ఒక చిన్న టెంట్ లో బతుకుతున్నాడు.

రెండుసార్లు ఎన్నికైనప్పటికీ తనకంటూ ఏమీ ఆస్తి సంపాదించుకోలేదు. నిజాయితీపరుడిగా పేరొందిన షాహుంగ్రా ఇన్నాళ్లూ ప్రభుత్వ గృహంలో నివసించేవాడు. అయితే ప్రభుత్వాధికారులు ఆయనను అక్కడినుంచి ఖాళీ చేయించారు. దీనితో విధిలేక పంజాబ్ లోని హోషియాపూర్ జిల్లాలో రోడ్డు ప్రక్కన టార్పాలిన్ టెంట్ వేసుకున్నాడు. భార్యాపిల్లలతో అందులోనే ఉంటున్నారు. కనీసం పార్టీ కూడా వీరిని పట్టించుకోక పోవడం దారుణం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -