Friday, April 26, 2024
- Advertisement -

ఆ ఎమ్మెల్యే కు ఫోన్ చేసిన మెగాస్టార్ .. ఎందుకంటే?

- Advertisement -

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఏ కష్టం కలగకుండా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఓ ఎమ్మెల్యే కు ఫోన్ చేసి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. “హలో శంకర్ ఎలా ఉన్నారు… కుటుంబ సభ్యులు బాగున్నారా..ప్రజల్లో బాగా తిరుగుతారు. పరిస్థితులు బాగాలేవు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి” అని మెగాస్టార్‌ చిరంజీవి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.

Also read:యాంకర్ శ్యామల ఖరీదైన విల్లా వీడియో.. మీ అయన కొట్టేసిందేనా అంటూ?

మానుకోట నా అభిమాన కోట శంకర్ మీరు చెప్పిన విధంగానే మీ మాట కోసం మీ జిల్లాకు ఆక్సిజన్ బ్యాంక్ ఇచ్చానని మెగాస్టార్ తెలిపినట్లు ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలియజేశారు.ఈ నేపథ్యంలోనే కరోనా పరిస్థితులలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం జిల్లాకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయడం పట్ల మహబూబ్ నగర్ జిల్లా వాసుల తరపున ఎమ్మెల్యే చిరంజీవి గారికి కృతజ్ఞతలు చెప్పినట్టు తెలుస్తోంది.

Also read:అలాంటి వార్తలు నమ్మకండి.. మా ఆయన ఆ పని చెయ్యట్లేదు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -