Wednesday, May 8, 2024
- Advertisement -

చంద్రబాబు ని మోడీ నమ్మట్లేదు

- Advertisement -
Ex MLA Vellampalli Srinivas  joined in YSRCP

ఏపీ ముఖ్యమంత్రి – తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేతిలో ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ నేతలు కీలు బొమ్మలుగా మారారు అని మాజీ ఎమ్మెల్యే వెల్లం పల్లి శ్రీనివాస్ సీరియస్ అవుతున్నారు. బీజేపీ కి రాజీనామా చేసి వెంటనే వైకాపా లో జేరిన ఆయన జగన్ సమక్షం లో మీడియా తో మాట్లాడారు.

చంద్రబాబు చేతిలో బెజేపీ నేతలు అందరూ కీలు బొమ్మలు అవుతున్నారు అని ఆయన ఏదంటే వీరు కూడా అదే చెబుతున్నారు అని మండి పడ్డారు. బీజేపీ కి ఏపీ లో మనుగడ కూడా లేదు అంటున్నారు ఆయన. తమకు మిత్రపక్షమే అయినప్పటికీ  కేంద్రంలో ఎన్టీఏ ప్రభుత్వమే చంద్రబాబు తీరును అనుమానిస్తోందని వెల్లంపల్లి తెలిపారు. చంద్రబాబు చూపెట్టే దొంగలెక్కల వల్ల ఏపీకి న్యాయం జరగడం లేదని ఆయన మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే నిధులకు సరిగ్గా లెక్కలు చెప్పడం లేదని అందుకే కేంద్రం ఆంధ్రాకు నిధుల మంజూరు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర విభజనకు పెద్దనోట్ల రద్దుకు ముందుగా లేఖ రాసిన నేత చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఆ తర్వాత మాట మార్చిన ఘనత కూడా బాబుదేనని ఎద్దేవా చేశారు. కోస్తా- రాయలసీమ జిల్లాల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -