దేశంలో కరోనా మహమ్మారితో ప్రజలు ఎంతగా తల్లడిల్లి పోతున్నారో అందరికీ తెలిసిందే. ప్రతిరోజూ నాలుగు లక్షల వరకు కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా వచ్చిందంటే ప్రజలు భయంతో వణికి పోతున్నారు. ఇక ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ దొరకని దీన స్థితి.. కొన్ని చోట్ల ఆక్సీజన్ అందక ప్రజలు చనిపోతున్నారు. కరోనా రోగులతో స్మశానాల్లో చోటు కూడా దొరకడం లేదు. కరోనా తో అయిన వాళ్లు దూరం అవుతున్నారు.. స్నేహ సంబంధాలు మాయం అవుతున్నాయి.
తాజాగా తండ్రి కరోనాతో చనిపోయాడన్న సమాచారమే ఆమె మనసు గాయ పరిచింది. నాన్న లేని లోకం ఎందుకు అనుకుందేమో ఆమె.. నాన్న చితి మంటపై దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ బాధాకరమైన సంఘటన రాజస్థాన్లోని బర్మార్ జిల్లాలో చోటు చేసుకుంది. దామోదర్ దాస్ శార్దా(73) అనే వృద్ధుడు కరోనాకు బలయ్యాడు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు.. ఈ ముగ్గురు అంత్యక్రియలకు హాజరయ్యారు.
ముగ్గురిలో చిన్న కూతురు చంద్ర శార్దా.. నాన్న మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ముగ్గురిలో చిన్న కూతురు చంద్ర శార్దా.. నాన్న మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చితి రగిలిపోతున్న సమయంలో మంటపై చంద్ర ఒక్కసారిగా దూకింది. నాన్న వెంటే తాను కూడా వెళ్లిపోతానని బోరుమన్నది. వెంటనే తేరుకున్న బంధువులు ఆమెను బయలకు లాగారు.. కానీ అప్పటికే ఆమె 70 శాతం కాలిన గాయాలతో ఆమె జోధ్పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అషుతో డేటింగ్ పై రాహుల్ షాకింగ్ కామెంట్స్..!