- Advertisement -
అమ్మాయిలు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పెట్టారా. వెంటనే ఓకె చేసేద్దామనుకుంటున్నారా. ఆ పని చేశారా.. తప్పులో కాలేసినట్లే. ఫేసు బుక్కుల్లోనో.. మరోచోట అమ్మాయిలు మీతో స్నేహం చేయాలని ఉందని అన్నారంటే ఆ రిక్వెస్ట్ ను కాస్త జాగ్రత్తగా గమనించండి అంటున్నారు ఐటిబిటి డైరక్టర్ జనరల్ క్రిష్ణ చౌదరి.
ఇంత భయం ఎందుకంటే విదేశాల్లో ఉన్న తీవ్రవాద సంస్ధలు భారత సమాచారాన్ని సేకరించేందుకు మహిళలతో ఇలాంటి ప్రయోగాలు చేయిస్తున్నారని ఆయన చెప్పారు. దీనిపై మన సైనికులు, ఇరత ఉన్నతాధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అంతే కాదు సాధారణ పౌరులు కూడా ఇలాంటి ఫ్రెండ్ షిప్ లకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.