Thursday, April 25, 2024
- Advertisement -

ఎఫ్​డీఏ పరీక్ష పేపర్ లీక్.. ఇద్దరు అరెస్ట్, పరీక్ష వాయిదా..!

- Advertisement -

కర్ణాటక పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​(కేపీఎస్​సీ) నిర్వహించాల్సిన ఫస్ట్​ క్లాస్​ అసిస్టెంట్​(ఎఫ్​డీఏ)ని వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్​డీఏ పరీక్షాపత్రం ముందుగానే లీక్​ అయినట్లు గుర్తించారు. ఇందులో సంబంధం ఉన్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అనుకున్న షెడ్యూల్​ ప్రకారం పరీక్ష శనివారం జరగాల్సి ఉంది. కానీ లీకేజీ కారణంగా ఈ నెల 24న నిర్వహించాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు కేపీఎస్​సీ నోటిఫికేషన్​ విడుదల చేసింది.

లీకేజ్​తో సంబంధం ఉన్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీసీబీ జాయింట్​ కమిషనర్​ సందీప్​ పాటిల్​ ట్వీట్​ చేశారు. చంద్రు, రాజప్ప అనే ఇద్దరిని ప్రధాన నిందితులుగా గుర్తించారు. వారి నుంచి పరీక్షాపత్రాలు, రూ. 24 లక్షల నగదు, మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -